మినీ బస్సు ప్రమాద బాధితులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

మినీ బస్సు ప్రమాద బాధితులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

జమ్మూకశ్మీర్ పూంచ్‌లోని సావ్జియాన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు లోయలో పడింది.  ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 25 మందికి గాయాలయ్యాయి.  ఈ ప్రమాద సమయంలో మినీ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులన్నట్టు తెలుస్తోంది. గాయపడ్డ ప్రమాద బాధితులను మండిలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మిగతా వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

దిగ్భ్రాంతి

పూంచ్‌లో జరిగిన మినీ బస్ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జమ్మూ కశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ  ప్రమాదంలో మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్టుస్పష్టం చేశారు.