రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. జోధ్పూర్ జిల్లాలోని బాలోత్ర-పలోడీ హైవైపై ట్రక్కు మరియు బొలేరో వ్యాను ఢీకొన్నాయి. ట్రక్కు పూర్తిగా బొలేరో పైకి ఎక్కింది. దాంతో అందులో ప్రయాణిస్తున్నవారిలో 11 మంది ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
For More News..
