
అబిడ్స్, వెలుగు: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ 14 మందికి నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించినట్లు అబిడ్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. అబిడ్స్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ 14 మందిని శుక్రవారం పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరి కేసు తీవ్రత ఆధారంగా రెండ్రోజుల నుంచి 7 రోజుల వరకు జైలు శిక్ష, రూ. 300 నుంచి 3,300 వరకు ఫైన్ విధించడంతో పాటు వారి లైసెన్స్ను సస్పెండ్ చేస్తూ నాంపల్లి 8వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చిందని ఇన్స్పెక్టర్ తెలిపారు.