
జీ–20 సమిట్కు ఢిల్లీ సిద్ధమవుతోంది. 19 దేశాల అధ్యక్షులు, యూరోపియన్ యూనియన్ కూటమిలోని 27 దేశాల ప్రెసిడెంట్లు, ప్రతినిధులతో పాటు 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు జీ20 సమిట్కు అటెండ్ అయ్యేందుకు ఢిల్లీకి వస్తున్నారు. ఈ నెల 9, 10వ తేదీల్లో ఈ సమిట్ జరగనుంది. ఈ క్రమంలో సుమారు 10వేల మంది అతిథులు వస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నది.
వివిధ దేశాధినేతలు తిరిగే సెంట్రల్ ఢిల్లీ ఏరియా మొత్తాన్ని హై-సెక్యూరిటీ జోన్గా మార్చేశారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ ఢిల్లీ గగనతలంపై ఏ అనుమానాస్పద వస్తువు కనిపించినా సరే కూల్చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాల కోసం 1.40 లక్షల మంది సెక్యూరిటీ సిబ్బందితో సహా 80వేల మంది ఢిల్లీ పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లు, యాంటీ -డ్రోన్ సిస్టమ్స్ను ఉపయోగిస్తున్నారు. 23 ఇంటర్నేషనల్ హోటళ్లలో వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ప్రతినిధులకు బస ఏర్పాటు చేశారు. సమిట్ జరిగే చుట్టు పక్క ప్రాంతాల్లోని అన్ని బిల్డింగ్లపై స్పైపర్లు అలర్ట్ గా ఉంటారు.