భిక్కనూరు మండలంలో 156 లీటర్ల మద్యం పట్టివేత

భిక్కనూరు మండలంలో 156 లీటర్ల మద్యం పట్టివేత

భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండల కేంద్రంలో గురువారం అక్రమంగా రవాణా చేస్తున్న 156 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.18 కాటన్లలో 180 మిల్లిలీటర్ల మద్యం సీసాలను కారులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మద్యంతో పాటు, కారును సీజ్​చేసినట్లు పేర్కొన్నారు. మద్యం తరలిస్తున్న గంగుల భూమయ్యతో పాటు సిద్ధిరామేశ్వర వైన్స్​ ఓనర్​పై కేసు నమోదు చేశామన్నారు.