మా అమ్మ ఇంకా చావలేదు.. వచ్చి పూర్తిగా చంపి వెళ్లు : ప్రియుడికి కాల్ చేసిన పదో తరగతి ప్రియురాలు

మా అమ్మ ఇంకా చావలేదు.. వచ్చి పూర్తిగా చంపి వెళ్లు : ప్రియుడికి కాల్ చేసిన పదో తరగతి ప్రియురాలు

హైదరాబాద్ సిటీలోని జీడిమెట్లలో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 10వ తరగతి చదువుతున్న తేజశ్రీనే.. ప్రేమకు అడ్డుగా ఉందని కన్న తల్లిని.. ప్రియుడితో కలిసి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ తర్వాత పోలీసులు చెప్పిన విషయాలు కొన్ని సంచలనంగా మారాయి. 

19 సంవత్సరాల వయస్సు ఉన్న శివ.. డీజే గ్రూపులో పని చేస్తుంటాడు.. ఇన్ స్ట్రాలో పరిచయం అయ్యింది తేజశ్రీ. పదో తరగతి చదువుతున్న తేజశ్రీ వయస్సు 16 ఏళ్లు మాత్రమే. వీళ్లిద్దరికీ పరిచయం అయ్యి ఎనిమిది నెలలే అయినా.. గాఢంగా ప్రేమించుకున్నారు. విషయం తెలిసిన తల్లి అంజలి.. పదే పదే వద్దని చెబుతూ వచ్చేది. శివతో ప్రేమ వ్యవహారం వద్దంటూ కొన్ని సార్లు కొట్టింది కూడా. తన ప్రేమకు తల్లి అంజలినే కారణం అంటూ.. కక్ష పెంచుకున్నది కుమార్తె తేజశ్రీ.. ఈ క్రమంలోనే తన ప్రియుడు శివ, అతని తమ్ముడు.. వాడికి కూడా 16 సంవత్సరాలే.. ఇద్దరితో కలిసి తన తల్లిని చంపటానికి ప్లాన్ వేసింది. 

ఇంట్లో తాను మాత్రమే ఉన్న సమయంలో.. తన తల్లిని చంపటానికి తన ప్రియుడు శివ, అతని తమ్ముడిని ఇంటికి పిలిపించింది. ఇంట్లో పూజ చేసుకుంటున్న తల్లి అంజలిని.. చున్నీతో గొంతు బిగించారు. చనిపోయిందని భావించి.. ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అంజలి కాళ్లు, చేతులు ఆడిస్తుండటంతో.. తన ప్రియుడికి కాల్ చేసింది తేజశ్రీ. మా అమ్మ ఇంకా చనిపోలేదు.. సగం చంపి వెళితే ఎలా.. వచ్చి పూర్తిగా చంపేసి వెళ్లు అంటూ శివకు కాల్ చేసింది తేజశ్రీ.

ఇంటి నుంచి సగం దూరం వెళ్లిన శివ, అతని తమ్ముడు.. మళ్లీ ఇంటికి తిరిగి వచ్చి పూర్తిగా చంపేసి వెళ్లారు. తన తల్లిని చంపటానికి ప్రేరేపించింది.. ప్లాన్ వేసింది అంతా కూడా పదో తరగతి చదువుతున్న 16 ఏళ్లు తేజశ్రీనే అని బాలానగర్ పోలీసులు వెల్లడించారు. ప్రేమ వ్యవహారంతోపాటు తల్లిపై ద్వేషం ఉందని.. తన తల్లి ఎప్పుడూ తనను ప్రేమగా చూడలేదని.. ఎప్పుడూ కొడుతూ ఉండేదని.. తిడుతూ ఉంటుందని విచారణలో తేజశ్రీ చెప్పినట్లు వెల్లడించారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. 

నిందితుల వయస్సు రీత్యా చట్టం ప్రకారం.. కోర్టు ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని.. కుమార్తె తేజశ్రీ ప్రోద్బలం వల్లే ఈ హత్య జరిగిందని వివరించారు డీసీపీ. అంజలి కుటుంబం 20 ఏళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటుందని.. వాళ్ల సొంతూరు మహబూబాబాద్ జిల్లా అని.. హైదరాబాద్ లోని తెలంగాణ సాంస్కృతిక కళా మండలిలో పని చేస్తుందని స్పష్టం చేశారు పోలీసులు. విచారణ తర్వాత నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారాయన. 

16 ఏళ్ల వయస్సు.. సోషల్ మీడియాలో 8 నెలల పరిచయం.. ఆ తర్వాత గాఢంగా ప్రేమించుకోవటం.. వద్దన్న తల్లినే హత్య చేయించటం అనేది షాకింగ్ గా ఉంది.. ఏదిఏమైనా కాలం మంచిగా లేదమ్మా అంటున్నారు జనం.. ఇలాంటివి చూసినప్పుడు.. వినప్పుడు..