
రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 487కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 45 మంది కోలుకున్నారు. 430 మంది కరోనా బాధితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. అటు ఏపీలోనూ శుక్రవారం 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు అధికారులు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381 చేరింది