కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 16 మంది మృతి

కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 16 మంది మృతి

గుజరాత్ భరూచ్ లో ఘోరం జరిగింది. పటేల్ వెల్ఫేర్ హాస్పిటల్ లోని కోవిడ్ వార్డులో అర్ధరాత్రి తర్వాత అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్టాఫ్ నర్సులు సహా 16 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో 50 మందిని స్థానికులు, ఫైర్ సేఫ్టీ సిబ్బంది రక్షించారు. భరూచ్-జంబుసర్ రహదారిలో ఉన్న ఈ హాస్పిటల్ ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుందన్నారు పోలీసులు. గంటలోపలే మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు ఫైర్ సేఫ్టీ సిబ్బంది. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు గుజరాత్ సీఎం విజయ్ రూపాని. చనిపోయిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు.