చత్తీస్‌‌గఢ్‌‌ పోలీసుల ఎదుట 16 మంది మావోయిస్టుల లొంగుబాటు

చత్తీస్‌‌గఢ్‌‌ పోలీసుల ఎదుట 16 మంది మావోయిస్టుల లొంగుబాటు

భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్‌‌ పార్టీకి చెందిన 16 మంది సోమవారం చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలో సుక్మా జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. పీఎల్‌‌జీఏ 2వ బెటాలియన్‌‌కు చెందిన వీరిపై మొత్తం రూ.25 లక్షల రివార్డు ఉంది. ఇందులో దోడి సుక్కీ, పూనెం రాహుల్‌‌పైన రూ.8 లక్షలు చొప్పున, లేకం లక్ష్మపై రూ.3 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సాయం కింద రూ. 5 వేలను సుక్మా ఎస్పీ కిరణ్‌‌ చౌహాన్‌‌ అందజేశారు. మావోయిస్టులు అడవిని వదిలి జనంలో కలవాలని పిలుపునిచ్చారు.