రాష్ట్రంలో నంబర్ 1.. దేశంలో 165

రాష్ట్రంలో నంబర్ 1.. దేశంలో 165
  •  ‘స్వచ్ఛ సర్వేక్షన్‌ ’ లో రామగుండం ర్యాంకులివి

గోదావరిఖని, వెలుగు: స్వచ్ఛ సర్వే క్షణ్-2019–2020 మొదటి త్రైమాసికంలో రామగుండం కార్పొరేషన్‌‌‌‌ దేశవ్యాప్త నగరాలతో పోటీ పడి 165 ర్యాంకు సాధించి రాష్ట్రంలోని నగరాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశంనిర్వహించారు. రామగుండం కార్పొరేషన్‌‌‌‌ ముందు వరుసలో నిలవడంపై రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ర్యాంకు సాధించడానికి కృషి చేసిన నగర పాలక సంస్థ, మెప్మా సిబ్బందికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛ సర్వే క్షణ్  2020 తుది ఫలితాల్ లోరామగుండం నగరం దేశంలోనే అత్యుత్తమ ర్యాంకు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.