వికారాబాద్, వెలుగు: వికారాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన తనిఖీల్లో 17.145 కిలోల ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైలు ద్వారా గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారంతో ఎక్సైజ్, డీటీఎఫ్, ఈగల్ టీం, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా రైల్వే స్టేషన్లో సోమవారం దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ప్లాట్ఫామ్పై అనుమానాస్పదంగా ఉన్న ఒక లగేజీ బ్యాగ్ను తెరిచి చూడగా భారీగా గంజాయి లభ్యమైంది. అయితే ఈ గంజాయిని రవాణా చేస్తున్న నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదని, వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని అధికారి విజయభాస్కర్ తెలిపారు.
