తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం

తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం రేపింది. పాత బాలుర, బాలికల హాస్టల్ లో 18 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. అందులో 11 బాలురు కాగా, 7గురు బాలికలున్నారు. ఒక మీటింగ్ కి వెళ్లడం వల్ల ముగ్గురికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ ముగ్గురి వల్లే అందరకీ వ్యాపించని సమాచారం. మొత్తం 110 మందికి టెస్ట్ చేయగా 15 మందికి నిర్థరణ అయింది. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో ఐసోలేషన్ లో ఉన్న ముగ్గు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.