
ఏపీలో కరోనా విజృంభిస్తుంది. ఇవాళ మరో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా 4, కడప 4, గుంటూరు 3, కర్నూల్ జిల్లాలో 3 ,చిత్తూరు,ప్రకాశం జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదయింది. దీంతో ఇవాళ(శనివారం) ఉదయం 10 గంటల వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180 కి చేరిందని ప్రభుత్వం బులిటెన్ రిలీజ్ చేసింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 27, గుంటూరు, కడపలో 23 చొప్పున కేసులు నమోదయ్యాయి.