జవహర్ నవోదయ స్కూల్లో కరోనా కలకలం

జవహర్ నవోదయ స్కూల్లో కరోనా కలకలం

ముంబై : మహారాష్ట్రలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిత్యం కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గతవారం నవీ ముంబైలోని నవోదయ స్కూల్లో 18 మంది విద్యార్థులకు కరోనా సోకగా.. తాజాగా మరో పాఠశాలలో చదువుతున్న 19 మంది వైరస్ బారిన పడ్డారు. తక్లీ దోఖేశ్వర్ ప్రాంతంలో ఉన్న జవహర్ నవోదయ రెసిడెన్షియల్ స్కూల్ లో దాదాపు 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి కరోనా టెస్టులు చేయించగా.. 19 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో అధికారులు బాధిత విద్యార్థులందరినీ పర్నర్ రూరల్ హాస్పిటల్లో ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు స్టూడెంట్స్ తో కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ గుర్తించి టెస్టులు చేసే పనిలో పడ్డారు. డిసెంబర్ నెలలో ముంబైలోని పలు స్కూళ్లలో విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. ముఖ్యంగా జవహర్ నవోదయ రెసిడెన్షియల్ స్కూళ్లలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

ఒమిక్రాన్ ఎఫెక్ట్: పది రాష్ట్రాలకు సెంట్రల్ టీమ్స్

కరోనా నిబంధనల ఉల్లంఘన: రెండ్రోజుల్లో కోటిన్నర ఫైన్లు