19 ఏళ్ల గ్యాంగ్ స్టర్.. యోగేష్ పై ఇంటర్ పోల్ నోటీస్

19 ఏళ్ల గ్యాంగ్ స్టర్.. యోగేష్ పై ఇంటర్ పోల్ నోటీస్

హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ యోగేష్ కద్యన్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. కడియన్‌పై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధాల చట్టం కింద అభియోగాలు మోపారు. గోప్యమైన వర్గాల సమాచారం ప్రకారం, అతను భారతదేశం నుండి తప్పించుకుని యుఎస్‌లో ఆశ్రయం పొందాడు.

గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) అణిచివేత తర్వాత, అనేక మంది గ్యాంగ్‌స్టర్లు నకిలీ పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి భారతదేశం నుండి పారిపోయారు, మరికొంత మంది అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. అలాగే నకిలీ పాస్‌పోర్టునుపయోగించి కడియన్‌ పారిపోయి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు.