జమ్ముూకాశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు సైనికుల వీరమరణం

జమ్ముూకాశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు సైనికుల వీరమరణం

జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్లో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. రాజోరి జిల్లా బాజిమల్ ప్రాంతంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు సైనికులు వీరమరణం పొందారు. మరోముగ్గురు గాయపడినట్లు తెలిపారు ఇందులో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు. 

కార్డన్ సెర్చ్ ఆపరేషన్ తర్వాత ధర్మాల్ లోని బాజిమాల్ ప్రాంతంలో దాక్కున్న ఇద్దరు టెర్రరిస్టులను అంతమొందించడానికి అదనపు దళాలను మోహరించారు. దీంతో ఈప్రాంతంలో యుద్ధవాతావరణం నెలకొంది. 

గాయపడివారిలో ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు హవల్దార్లు ఉన్నారు ఇతర అధికారులుకూడా గాయపడ్డారు. చికిత్స కోసం ఉదంపూర్ లోని ఆర్మీ కమాండ్ ఆస్పత్రికి తరలించారు. 

బాజిమాల్ లో దాక్కున్న ఇద్దరు టెర్రరిస్టులు విదేశీ పౌరులుగా అనుమానిస్తున్నారు. ఆదివారం నుంచి ఆ ప్రాంతంలో తిరుగుతున్నారని.. ప్రార్థనా మందిరాల్లో ఆశ్రయం పొందారని అధికారులు పేర్కొన్నారు.