తెలంగాణ ప్రభుత్వం రూ.2 వేల కోట్ల అప్పు

తెలంగాణ ప్రభుత్వం రూ.2 వేల కోట్ల అప్పు

హైదరాబాద్​, వెలుగు: ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్ల అప్పులు సమీకరించుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ రిజర్వ్ బ్యాంక్ ద్వారా బాండ్లు జారీ చేసింది. వెయ్యి కోట్ల విలువైన బాండ్లను 11 ఏండ్ల కాలానికి, మరో వెయ్యి కోట్ల విలువైన బాండ్లను 21 ఏండ్ల కాలానికి విడుదల చేశారు. బాండ్లను ఆర్ బీఐ వచ్చే మంగళవారం వేలం వేయనుంది. వేలం అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రూ.4400 కోట్లు రుణాల ద్వారా సమీకరించుకొంది. తాజాగా అప్పుతో ఆ మొత్తం రూ.6400 కోట్లకు చేరనుంది.