న్యూఢిల్లీ: మనదేశంలో రాన్సమ్వేర్, ఐఓటీ సైబర్ దాడులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వీటి సంఖ్య రెండు రెట్లు పెరిగిందని సోనిక్వాల్ తయారు చేసిన రిపోర్ట్ వెల్లడించింది. అమెరికా, యూకేలో దాడులు తగ్గగా, ఇండియాలో 133 శాతం, జర్మనీలో 52 శాతం పెరిగాయి. క్రిప్టోజాకింగ్, ఐఓటీ మాల్వేర్, ఎన్క్రిప్టెడ్ థ్రెట్స్ కూడా పెరిగాయి. గ్లోబల్గా మాత్రం రాన్సమ్వేర్ దాడులు 41 శాతం తగ్గాయి. సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతులతో, టెక్నాలజీతో దాడులు చేస్తుండటంతో కంపెనీలు మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఇండియాలో రాన్సమ్వేర్, ఐఓటీ దాడులు పెరిగినా, క్రిప్టో దాడుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది.
సైబర్దాడులు పెరగడం వల్ల ఇండియా ఎకానమీకి కూడా ప్రమాదమని, మాన్యుఫాక్చరింగ్ మొదలుకొని ఫార్మా వరకు... చాలా ఇండస్ట్రీలు ఇబ్బందిపడుతున్నాయని సోనిక్వాల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ దేవాశిష్ ముఖర్జీ అన్నారు. స్కూళ్లను, గవర్నమెంట్ఆఫీసులను, రిటైల్ ఆర్గనైజేషన్లను సైబర్ క్రిమినల్స్ ఇబ్బంది పెడుతున్నారని ఈ రిపోర్టు తెలిపింది. దీంతో వీటికి సిస్టమ్డౌన్టైమ్, ఆర్థిక నష్టాలు, ప్రతిష్ట దెబ్బతినడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఎడ్యుకేషన్సెక్టార్పై దాడులు 320 రెట్లు, గవర్నమెంట్సంస్థలపై దాడులు 89 రెట్లు పెరిగాయి.