
జమ్మూకశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భారత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సెర్చింగ్ చేపట్టిన బలగాలు.. కుల్గామ్లోని ఉగ్రవాదుల స్థావరాలను చుట్టుముట్టాయి. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు దిగారు. జవాన్లు చేసిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు మృతిచెందారు. ఘటనాస్థలంలో భారీగా మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.