ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో యూనివర్సిటీ స్టూడెంట్ల పాత్ర ఉందని చెందిన తెలంగాణ జనరల్ స్టూడెంట్స్ ఓయూ జేఏసీ పేర్కొంది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే లను బీఆర్ఎస్లోకి తీసుకుని ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు.
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీల అభివృద్ధికి రూ.200 కోట్ల గ్రాంట్ రిలీజ్ చేయాలని కోరారు. సమావేశంలో కిరణ్, ప్రేమ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.