ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. ఒకే రోజులో 207 మందికి వైరస్

ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. ఒకే రోజులో 207 మందికి వైరస్

అమరావతి: ఏపీలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు వందల్లో నమోదవుతున్నాయి. గడిచిన ఒకే రోజులో 11,775 మంది శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది. ఇందులో ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందినవారు 66 మంది ఉండగా.. 141 మంది రాష్ట్రానికి చెందినవారేనని తెలిపింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని, 59 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. తాజా కేసులతో రాష్ట్రంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5,636 పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,402 మంది స్థానికులు కాగా, 1,035 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు, 199 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు. మొత్తం మీద, 3,091 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.