
హైదరాబాద్, వెలుగు: ఐసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొత్తం ఎంబీఏ, ఎంసీఏలోని 27,803 సీట్లకుగానూ 25,733 సీట్లు నిండినట్లు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వెల్లడించారు. రాష్ట్రంలోని 258 ఎంబీఏ కాలే జీల్లో 24,487 సీట్లకు 22,422 సీట్లు భర్తీకాగా, 52 ఎంసీఏ కాలేజీల్లో 3,316 సీట్లకు 3,311 సీట్లు నిండాయి. స్టేట్ లో 96 కాలేజీల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 30లోగా ఆన్లైన్తో పాటు కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.