ఏపీలో కొత్తగా 222 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

ఏపీలో కొత్తగా 222 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

అమరావతి: ఏపీలో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 222 మందికి కరోనా సోకినట్లు తేలిందని శనివారం ఏపీ ఆరోగ్య శాఖ బులిటెన్ లో పేర్కొంది. ఇందులో రాష్ట్రానికి చెందిన వారు 186 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, విదేశాల నుంచి వచ్చినవారు 36 మంది ఉన్నట్లు తెలిపింది. గడిచిన ఒకరోజులో 14,477 మంది శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మరణాలు సంఖ్య 82కు చేరుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల 5858కి చేరుకున్నాయి. 3185 మంది కోలుకున్నారు.