రాష్ట్రంలో ఇవాళ 2295 కరోనా కేసులు..ముగ్గురు మృతి

రాష్ట్రంలో ఇవాళ 2295 కరోనా కేసులు..ముగ్గురు మృతి

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2295 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం ముగ్గురు కరోనా సోకి కోలుకోలేక మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.  ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1452, మేడ్చల్ పరిధిలో 232, రంగారెడ్డి జిల్లా పరిధిలో 218 కేసులు నమోదయ్యాయి. 
కరోనా సోకిన వారిలో ఇవాళ 278 మంది రికవరీ అయి ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు. అలాగే మరో 9861 మంది (యాక్టివ్ కేసులు)ఆస్పత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. కరోనా పరీక్షలు నిర్వహించిన కేసుల్లో ఇంకా 10వేల 336 మందికి చేసిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

 

 

ఇవి కూడా చదవండి

 

ఒమిక్రాన్ టెన్షన్: ఎట్ రిస్క్ దేశాల సంఖ్య పెంపు

వ్యాక్సిన్ వేసుకోని వారిని అనుమతిస్తే 25వేలు ఫైన్

పీఆర్సీపై ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన