గౌహతి: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ అసోం రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న మొన్నటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ రాలేదు అనుకుంటున్న తరుణంలో ఇవాళ ఒకేరోజు 7 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో అసోం రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9కి చేరింది. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి ఒమిక్రాన్ సోకినట్లు తేలడంతో వెంటనే స్పందించింది. కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.
కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని.. మార్గదర్శకాలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు రేపట్నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా డెల్టా వేరియంట్ కేసులు పెరగడాన్ని తేలిగ్గా తీసుకోవద్దని.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలు, జనం గుమిగూడే చోట జాగ్రత్తలు పాటించాలని కోరింది. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లో వ్యాక్సిన్ వేసుకోని వారిని అనుమతించవద్దని.. ఒకవేళ అనుమతిస్తే నిర్వాహకులకు రూ.25వేలు జరిమానా విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
మహేశ్ బాబు కోలుకోవాలంటూ చిరంజీవి ట్వీట్
పాక్ చరిత్రలో తొలిసారి.. సుప్రీం కోర్టు జడ్జిగా మహిళ
ఒమిక్రాన్ను గుర్తించే కిట్.. రూపొందించిన టాటా