మహేశ్ బాబు కోలుకోవాలంటూ చిరంజీవి ట్వీట్

మహేశ్ బాబు కోలుకోవాలంటూ చిరంజీవి ట్వీట్

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనా బారిన పడినట్లు వచ్చిన వార్తపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కరోనా మహమ్మారికి తగిన చికిత్స చేయించుకుని  వెంటనే కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. మళ్లీ సాధారణ దైనందిన జీవితంలోకి రావాలని కోరారు.  ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. కరోనా డెల్టా వేరియంట్ మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో నిన్న శుక్రవారం మహేశ్ బాబు కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ రావడంతో హోం ఐసొలేషన్ లో ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తున్నట్లు ప్రకటించారు. తనను కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు పాటించాలని.. వ్యాక్సిన్ వేయించుకోవాలని మహేశ్ బాబు నిన్న ట్విట్టర్ ద్వారా వెల్లడించగా.. ఇవాళ చిరంజీవి స్పందించి ట్వీట్ చేశారు.

 

 

 

 

 

 

ఇవి కూడా చదవండి

ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్.. రూపొందించిన టాటా

నీళ్లు తాగితే దంతాలకు కూడా మంచిదే