
న్యూఢిల్లీ: మే 1 నుంచి స్టార్ట్ అయ్యే థర్డ్ ఫేజ్ వ్యాక్సినేషన్కు రెండు రోజుల్లో 2.4 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. 18 ఏండ్లు పైబడిన వారందరికీ మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. దీనికోసం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్లు స్టార్ట్ చేసింది. ఏప్రిల్ 28న 1.37 కోట్ల మంది, 29న 1.04 కోట్ల మంది వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 15.22 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని చెప్పింది. ఈ డోసులలో 67% వరకు మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ, బీహార్, ఏపీలకు అందించామని కేంద్రం పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 21 లక్షల వ్యాక్సిన్ డోసులు అందించామని తెలిపింది. 22,43,097 సెషన్లలో 15,22,45,179 డోసులు వేసినట్లు శుక్రవారం పేర్కొంది.