
- ఒకనెల ఇన్ స్టాల్మెంట్స్ ముందే విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర పన్నుల వాటా మూడో ఇన్ స్టాల్ మెంట్ కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. సాధారణ వాయిదాతో కలిపి ఒక నెల అడ్వాన్స్ ఇన్ స్టాల్మెంట్ కింద రాష్ట్రానికి రూ. 2,486 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా కింద దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలకు కలిపి రూ. 1,18, 280 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిపింది. రాష్ట్రాలకు మూలధనం, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాధాన్యతా ప్రాజెక్ట్ లు, స్కీమ్లు, ఇతరత్రా ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఒక నెల ఇన్ స్టాల్మెంట్ ను అడ్వాన్స్ గా చెల్లించినట్లు తెలిపింది. కాగా, ఏపీకిరూ.4,787 కోట్లు విడుదల చేసింది.