
ముంబైలో ఎయిర్ పోర్టు లోడర్స్ పోస్టుల కోసం ఎయిరిండియా మంగళవారం నిర్వహించిన డ్రైవ్ కు నిరుద్యోగులు పోటెత్తారు. 2,216 పోస్టులకు.. ఏకంగా 25 వేల మందికి పైగా తరలివచ్చారు. దీంతో ముంబై ఎయిర్ పోర్టు కిక్కిరిసిపోయింది. తోపులాట లాంటి పరిస్థితి ఎదురవడంతో నిరుద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు.