
బాయ్ చెప్పి బాధపెట్టిందని ఓ యువతిని పెట్రోల్ తో తగల బెట్టాడు బస్ కండక్టర్. 20 శాతం కాలిన గాయాలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
తమిళనాడు కడలూరుకు చెందిన సలోమి(26)కి ఇద్దరు పిల్లలు. ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఆమె భర్త జాన్ విక్టర్ ఆర్మీలో సేవలందిస్తున్నాడు. అయితే బాధితురాలు రోజూ ఇంటి నుంచి ఆఫీస్ కు ఓ ప్రైవేట్ బస్సులో వెళుతుండేంది. ఆ ప్రైవేట్ బస్సు కండక్టర్ సుందరమూర్తి. సలోమి రోజూ అదే బస్సు ఎక్కడంతో కండక్టర్ గా పనిచేస్తున్న సుందరమూర్తితో సాన్నిహిత్యంగా ఉండేంది. సాన్నిహిత్యంతో రోజు ఆఫీస్ నుంచి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడుకునేవారు. దీన్ని ఆసరగా చేసుకున్న సుందరమూర్తి పెళ్లి చేసుకోవాలంటూ సలోమీపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన సలోమీ నిందితుణ్ని దూరం పెట్టింది. ఫోన్ కాల్స్ కు రిప్లయ్ ఇవ్వడం మానేసింది.
ఈ నేపథ్యంలో సలోమీ రోజూ వెళ్లే ప్రైవేట్ బస్సులోనే ఆఫీస్ కు వెళ్లింది. అప్పటికే మాటువేసి ఉన్న సుందరమూర్తి ఆమెను వెంబడిస్తూ ఆఫీస్ కు వెళ్లాడు. పెళ్లి చేసుకుందామని, తనతో ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించాడు. అందుకు సలోమీ స్నేహంగా ఉన్నాననే కారణంతో వేధిస్తున్నావని, అందుకే మాట్లాడడం మానేశానని చెప్పింది. ఆగ్రహానికి లోనైన సుందరమూర్తి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ తో బాధితురాలికి నిప్పంటించి పరారయ్యాడు. దీంతో అప్రమత్తమైన ఆఫీస్ సిబ్బంది బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. 20శాతం కాలిన గాయాలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
ఈ దారుణం సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. తనతో మాట్లాడనందుకే సుందర మూర్తి సలోమీపై పెట్రోల్ తో దాడి చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.