29 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

29 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కామారెడ్డి, వెలుగు : మాచారెడ్డి పోలీస్ స్టేషన్​పరిధిలోని భవానీపేట తండా శివారులో ఉన్న  వైకుంఠధామం రూమ్​లో అక్రమంగా నిల్వ ఉంచిన 29 క్వింటాళ్ల రేషన్​  బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సింధూశర్మ  ఒక ప్రకటనలో తెలిపారు. భవానీపేట తండాకు చెందిన మాలోవత్​ మోహన్​  వైకుంఠధామం రూమ్​లో

అక్రమంగా రేషన్​ బియ్యం నిల్వ ఉంచినట్లు  సమాచారం అందడంతో టాస్క్​ఫోర్స్​ సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారన్నారు. మాలోవత్​ మోహన్​పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.