ఇదే ఫస్ట్ టైం..24 గంటల్లో 29 వేల కేసులే

ఇదే ఫస్ట్ టైం..24 గంటల్లో 29 వేల కేసులే

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన  24 గంటల్లో 8,44,382 టెస్టులు చేయగా.. 29,164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలలుగా ఇంత తక్కువ మొత్తం నమోదు కావడం ఇదే మొదటి సారి. నిన్నటి వరకు నమోదైన కేసులతో కలిపి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 88,74, 291 కు చేరింది. నిన్న 449 మంది చనిపోవడంతో కోవిడ్ మరణాలు 1,30,519 కు చేరాయి. నిన్న మరో 40,791 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 82,90,371 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 4,53,401 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.