ఇరాన్ నుంచి మరో 292 మంది భారత్కు తరలింపు

ఇరాన్ నుంచి మరో 292 మంది భారత్కు తరలింపు

న్యూఢిల్లీ: ఇరాన్ నుంచి మరో 292 మంది భారత పౌరులు స్వదేశానికి చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు వారిని ప్రత్యేక విమానంలో మష్హాద్ నుంచి ఢిల్లీకి తరలించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇరాన్‌‌‌‌‌‌‌‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి తర్వాత ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో నివసిస్తున్న భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ గత వారం ఆపరేషన్ సింధును చేపట్టిన విషయం తెలిసిందే. ​

ఇందులో భాగంగా ఇప్పటి వరకు 2,295 మంది భారతీయులను ఇరాన్ నుంచి స్వదేశానికి తీసుకువచ్చినట్టు రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. దీంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన సీ-17 మిలటరీ ట్రాన్స్​పోర్ట్​ఎయిర్ క్రాఫ్ట్​ ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌లో నివసిస్తున్న 165 మంది మనోళ్లను ఢిల్లీకి తీసుకొచ్చిందని, వారికి విమానాశ్రయంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ స్వాగతం పలికారని ఆయన చెప్పారు. సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో 290 మంది భారతీయులను, ఒక శ్రీలంక వాసిని ఇరాన్  నుంచి ఢిల్లీకి తరలించినట్టు రణధీర్ జైస్వాల్ తెలిపారు.