ఐపీఎల్‎లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. టోర్నీ హిస్టరీలోనే తొలి ప్లేయర్

ఐపీఎల్‎లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. టోర్నీ హిస్టరీలోనే తొలి ప్లేయర్

చంఢీఘర్: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‎లో మరో చారిత్రాత్మక రికార్డ్ సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే సీజన్‌లో 700 ప్లస్ రన్స్ పూర్తి చేసిన తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్‎గా నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. శుక్రవారం (మే 29) ముల్లాన్‎పూర్‎లోని మహారాజా యాదవేంద్ర స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‎తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచులో ఈ మైలురాయిను అందుకున్నాడు. 

దీంతో పాటు మరో రికార్డ్ కూడా సృష్టించాడు వైభవ్. ఐపీఎల్ చరిత్రలోనే పవర్‌ప్లేలో 500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. 2016 ఎడిషన్‌లో పవర్‌ప్లేలో 467 పరుగులు చేశాడు వార్నర్. 2026లో పరుగుల వరద పారిస్తోన్న15 ఏళ్ల బుడ్డోడు వార్నర్ రికార్డును తుడిచిపెట్టాడు. 
 

పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు:

  • 1    వైభవ్ సూర్యవంశీ    రాజస్థాన్ రాయల్స్    2026    700+ పరుగులు
  • 2    యశస్వి జైస్వాల్    రాజస్థాన్ రాయల్స్    2023    625 పరుగులు
  • 3    షాన్ మార్ష్        కింగ్స్ ఎలెవన్ పంజాబ్    2008    616 పరుగులు
  • 4    రియాన్ పరాగ్    రాజస్థాన్ రాయల్స్    2024    573 పరుగులు
  • 5    ప్రభ్‌సిమ్రాన్ సింగ్    పంజాబ్ కింగ్స్    2025    549 పరుగులు