రాష్ట్రంలో మరో 2,932 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 2,932 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,932 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,17,415 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 11 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 799కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 872 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 86,095గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,941 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా.. మరో 22,097 కేసులు హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది.

నిన్న 33,439 టెస్టులు చేయగా వాటిలో 2,932 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11,75,919 టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 530, రంగారెడ్డి 218, మేడ్చల్ 218, కరీంనగర్ 168, నల్గొండ 159, ఖమ్మం 141, నిజామాబాద్ 129, మంచిర్యాల 118, జగిత్యాల 113, సూర్యపేట్ 102, సిద్ధిపేట్ 100, భద్రాద్రి 89, వరంగల్ అర్బన్ 80, మహబూబాబాద్ 76, మహబూబ్ నగర్ 67, రాజన్న సిరిసిల్ల 64, పెద్దపల్లి 60, వనపర్తి 51, కామారెడ్డి 51, సంగారెడ్డి 49 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

ఇష్టారాజ్యంగా కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతులు

జనం చేతికి అందకుండానే ‘డబుల్’ ఇండ్లు పెచ్చులూడుతున్నయ్

నాలాలపైనే లీడర్ల ఇండ్లు!