దళిత యువతిని వేధించి.. కడాయిలో తోసి పరార్​

దళిత యువతిని వేధించి.. కడాయిలో తోసి పరార్​

బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పట్(యూపీ): ఉత్తరప్రదేశ్​లోని బుదౌన్ జిల్లాలో దారుణం జరిగింది. లైంగిక వేధింపులపై నిరసన తెలిపినందుకు ఓ దళిత యువతిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. వేడి కడాయిలో తోసి పారిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. ముజఫర్​నగర్​లో నివాసం ఉంటున్న ఓ దళిత యువతి(18) స్థానికంగా ఓ బెల్లం తయారీ యూనిట్​లో పనిచేస్తోంది. అదే కంపెనీలో ప్రమోద్, రాజు, సందీప్ లు అనే ముగ్గురు యువకులు కూడా పనిచేస్తున్నారు. 

ఈ క్రమంలో గత బుధవారం దళిత యువతితో బుధవారం అసభ్యంగా ప్రవర్తించారు. లైంగికంగా వేధించారు. అందుకు నిరసన తెలపడంతో బెల్లం తయారీ కోసం వాడే వేడి వేడి కడాయిలో ఆమెను పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. యువతి శరీరం మొత్తం కాలింది. చుట్టు పక్కల వాళ్లు గమనించి ఆమెను స్థానికంగా హాస్పిటల్​కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని జీటీబీ హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి సోదరుడు శనివారం బినౌలి పోలీస్​స్టేషన్​లో  ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్​ చేశారు.