ఆదిలాబాద్ జిల్లాలో ఓ వివాహ విందు పలు కుటుంబాల్లో విషాదం నింపింది. నార్నూరు మండలం కొత్తపల్లి -H కోలంగూడ గ్రామంలో ఇవాళ ఓ పెళ్లి విందు పెట్టారు. దానికి పెద్దసంఖ్యలో బంధువులు హాజరయ్యారు. పెళ్లి విందు తిన్న తర్వాత అందరికీ వాంతులయ్యాయి. కొందరు కళ్లు తిరిగి పడిపోయారు. ఉట్నూరు సర్కారు దవాఖానకు వీరిని తీసుకెళ్లారు.
పెళ్లి విందు తిన్న ముగ్గురు చనిపోయారు. మరో 22 మందికి సీరియస్ గా ఉంది. వీరికి చికిత్స అందిస్తున్నామని.. కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు చెప్పారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.