కశ్మీర్లో ఎన్ కౌంటర్: ముగ్గురు టెర్రరిస్టుల హతం

కశ్మీర్లో ఎన్ కౌంటర్: ముగ్గురు టెర్రరిస్టుల హతం

జమ్మూకశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. శ్రీనగర్ శివారులో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ ఐజీ తెలిపారు. వీరిలో ఒకరిని జైషే మహ్మద్ సంస్థకు చెందిన సుహాలి అహ్మద్ గా గుర్తించామన్నారు. ఈ నెల 13న భద్రతా బలగాల బస్సుపై ఎటాక్ చేసిన వారిలో వీరు కూడా ఉన్నారని చెప్పారు. బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టామన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు, ఒక CRPF జవాన్ కు గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. వారిని హాస్పిటల్ కు తరలించామని.. ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. కశ్మీర్ లో 36 గంటల్లో మూడు ఎన్ కౌంటర్లు జరిగాయి. వీటిలో మొత్తం 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్, కుల్గాం జిల్లాలోనూ రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి.  

మరిన్ని వార్తల కోసం: 

రవీందర్‌ సింగ్‌ను‌‌‌‌‌‌‌ ‌‌పిలిపించుకుని మాట్లాడిన సీఎం

300 కోట్ల అప్పు.. 7 నెలల్లోనే రైటాఫ్​

‘అర్జున ఫల్గుణ’పై నమ్మకముంది