పిడుగు పడి 30 మేకలు, కాపరి మృతి

పిడుగు పడి 30 మేకలు, కాపరి మృతి

గండీడ్, వెలుగు : పిడుగు పడి 30 మేకలతో పాటు, ఓ కాపరి చనిపోయాడు. ఈ ఘటన మహబూబ్​నగర్​ జిల్లా గండీడ్ మండలం పెద్ద వార్వాల్ లో ఆదివారం జరిగింది. పెద్దవార్వాల్ గ్రామానికి చెందిన కటికె బాల్ రాజ్ (50)తన 25 మేకలు, అదే గ్రామానికి చెందిన జోగు బాలయ్య ఐదు మేకలను మేతకు తీసుకెళ్లారు.

సాయంత్రం భారీ వర్షం పడడంతో నాగులగుట్ట సమీపంలో ఉన్న బాల్ రాజ్ పొలంలోని కొట్టంలో వేచి ఉన్నారు. ఇదే సమయంలో కొట్టం సమీపంలో పిడుగు పడడంతో బాలరాజ్ తో పాటు, 30 మేకలు చనిపోయాయి. దీంతో బాలయ్య ఉర్లోకి వెళ్లి గ్రామస్తులకు విషయం చెప్పాడు.