30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

30 లక్షల  ఉద్యోగాలు ఇచ్చినం :  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేండ్లల్లో తమ ప్రభుత్వం 47 బిలియన్​డాలర్ల పెట్టుబడులు సాధించిందని, తద్వారా 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ట్రేడ్​ప్రమోషన్​కార్పొరేషన్​చైర్మన్​గా బాధ్యతలు చేపట్టిన మఠం భిక్షపతిని ఆమె అభినందించి మాట్లాడారు. 

ఇండస్ట్రీస్​సెక్టార్​లో దేశంలోనే తెలంగాణ నంబర్​వన్​గా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ట్రేడ్​కార్పొరేషన్​ఆదాయం రూ.30 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.130 కోట్ల లాభాలకు ఎదిగిందని కవిత తెలిపారు. 

భిక్షపతితో పాటు స్టేట్​వేర్​హౌసింగ్​కార్పొరేషన్​చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించిన ఉద్యమకారుడు సాయిచంద్​సతీమణి రజని, స్టేట్​ఇండస్ట్రీయల్​డెవలప్​మెంట్​కార్పొరేషన్​చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్​తన్వీర్​ను  మంత్రులు హరీశ్​రావు, మహమూద్​అలీ, వేముల ప్రశాంత్​రెడ్డి, నిరంజన్​రెడ్డి తదితరులు అభినందించారు.