రామప్ప టెంపుల్ సందర్శించిన ఫారినర్స్

రామప్ప టెంపుల్  సందర్శించిన ఫారినర్స్

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను శనివారం దక్షిణాఫ్రికా దేశానికి చెందిన 30 మంది సందర్శించారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.  వారు దక్షిణాఫ్రికాలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న అధికారులు, జర్నలిస్టులు అని తెలిపారు. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ శిక్షణలో భాగంగా హైదరాబాద్ లోని  మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్నారు.

 అందులో భాగంగా శనివారం రామప్ప టెంపుల్ సందర్శించారు. గైడ్ ద్వారా రామప్ప చరిత్ర శిల్పకళా విశిష్టతను తెలుసుకున్నారు. అనంతరం రామప్ప లేక్ లో బోటింగ్ చేశారు. వారి వెంట అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్  ఆఫీసర్ సూర్య కిరణ్, సిఐ రంజిత్ కుమార్, ఎస్ఐ రాజు,  తహసీల్దార్ సదానందం, డిటి కిషోర్, ఎం సి హెచ్ ఆర్ డి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.