భారత్ లో 3 కోట్లు దాటిన టెస్టులు..50 వేలు దాటిన మరణాలు

భారత్ లో 3 కోట్లు దాటిన టెస్టులు..50 వేలు దాటిన మరణాలు

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 57,982 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య మొత్తం  26,47,664 కి చేరింది. మరో 941 మంది చనిపోవడంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 50,921 కి చేరింది. 19,19,843 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 6,76,900 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 7,31,697 టెస్టులు చేశారు. వీటితో కలిపి దేశంలో ఆగస్టు 16 వరకు కరోనా టెస్టుల సంఖ్య మొత్తం 3,00,41,400 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.