ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కరోనా కలకలం.. 31 మందికి పాజిటివ్

ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కరోనా కలకలం.. 31 మందికి పాజిటివ్

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 147 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో కరోనా కలకలం రేపుతోంది. వార్డ్ లో ఉన్న మొత్తం 31 మంది మానసిక రోగులకు కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. వార్డ్ లో ఉన్న పేషంట్స్ బయటకి రారు.. కానీ కరోనా ఎలా వచ్చిందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

వార్డ్ బాయ్స్, నర్సుల నుంచి కరోనా సోకినట్టు పేషంట్స్ బంధువులు అనుమానిస్తున్నారు. మెంటల్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్ లో క‌రోనా రోగులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మెంటల్ హాస్పిటల్ స్టాఫ్(డాక్టర్స్, నర్సులు, వార్డ్ బాయ్స్) దాదాపు 10 మందికి కరోనా వచ్చిన‌ట్టు సూపరింటెండెంట్ ఉమా శంకర్ తెలిపారు. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో కొనసాగుతున్న కొవిడ్ సెంటర్‌లో 200 మంది చికిత్స పొందుతున్నారు.