భారత్ లో కరోనా పంజా.. 9 వేలు దాటిన మరణాలు

భారత్ లో కరోనా పంజా.. 9 వేలు దాటిన  మరణాలు

భారత్ లో కరోనా పంజా విసురుతోంది. ప్రతి రోజు దాదాపు 12 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా గత 24 గంటల్లో 11929 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 311 మంది చనిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,922 కు చేరగా.. మరణాల సంఖ్య9195కు చేరింది. ఇప్పటి వరకు162379 మంది కరోనా నుంచి కోలుకోగా..ఇంకా 149348 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 104568 కరోనా కేసులు నమోదవ్వగా.. 3830 మంది చనిపోయారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్ నాల్గవ స్థానంలో ఉంది.