ఒకేరోజు 11502 కేసులు..325 మరణాలు

ఒకేరోజు 11502 కేసులు..325 మరణాలు

భారత్ లో కరోనా వేగంగా వ్యాప్తి  చెందుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 11,502 కరోనా పాజిటివ్  కేసులు నమోదవ్వగా..325 మంది చనిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,424కు  చేరగా.. మరణాల సంఖ్య 9520కు చేరింది. ఇప్పటివరకు 1,69,798 మంది కరోనా నుంచి కోలుకోగా..1,53,106 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 1,07,958 కరోనా కేసులు నమోదవ్వగా..3950 మంది చనిపోయారు.