- లిస్ట్లో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పీఆర్ టాప్
- ఆ తర్వాతి స్థానంలో ఈసీఎల్ ఫైనాన్స్ లిమిటెడ్
న్యూఢిల్లీ: వివిధ రాజకీయ పార్టీల కోసం 33 సంస్థలు ఏప్రిల్ 2019 నుంచి జనవరి 2024 వరకు కొనుగోలు చేసిన రూ. 9.6 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల ఎక్స్పైర్డ్ అయ్యాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రచురించిన డేటా ప్రకారం ఈ లిస్ట్లో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్సర్వీసెస్ పీఆర్సంస్థ టాప్లో నిలిచింది. ఆ తర్వాత ఈసీఎల్ ఫైనాన్స్ లిమిటెడ్, పసిఫికా ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడెల్విస్ రూరల్ కార్పొరేట్ సర్వీస్ ఉన్నాయి.
ఈ నాలుగు సంస్థలు కలిసి గడువు తీరిపోయిన బాండ్లలో 72.3 శాతం కొనుగోలు చేశాయి. అలాగే, 15 మంది వ్యక్తులు కొన్న రూ. వెయ్యి నుంచి రూ.25వేల విలువ చేసే బాండ్లు ఎక్స్పైర్డ్ అయ్యాయి. మరో ఆరు సంస్థలు కొనుగోలు చేసిన రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల విలువ చేసే బాండ్లు ఎన్క్యాష్ కాలేదు. ఎనిమిది కంపెనీలు కొన్న మిలియన్ నుంచి 5 మిలియన్ల విలువైన బాండ్ల గడువుకూడా ముగిసిపోయినట్టు ఎలక్షన్ కమిషన్ డేటా వెల్లడించింది. కాగా, బాండ్ల గడువు తీరిపోవడంతో ఈ డబ్బులన్నీ ప్రధానమంత్రి సహాయనిధి (పీఎం రిలీఫ్ ఫండ్)కి చేరాయి.