హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని 34 ప్లాట్లకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించనుంది. ఇందులో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని 16 ల్యాండ్ పార్సిల్స్ అమ్మకాలపై హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో బేగంపేట టూరిజం ప్లాజాలో ప్రీ బిడ్ మీటింగ్ జరిగింది. దీనికి పలువురు రియల్ ఎస్టేట్ గ్రూపులు, రియల్టర్లు హాజరయ్యారు.
ప్లాట్ల వివరాలను అధికారులు వారికి వివరించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్టీసీ ఆన్లైన్లో వేలం నిర్వహించనుంది. రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాల్లో 16 ప్లాట్లు, సంగారెడ్డి జిల్లాలోని 3 మండలాల్లో 10 ప్లాట్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని 4 మండలాల్లో 8 ప్లాట్లను హెచ్ఎండీఏ వేలంలో ఉంచింది. ఈ నెల 22న వేలం జరగనుంది. బుధవారం మేడ్చల్లో ప్రీ బిడ్డింగ్, గురువారం పఠాన్ చెరువు గీతం యూనివర్సిటీలో సంగారెడ్డి జిల్లా ప్లాట్ల వేలానికి మీటింగ్ జరగనుంది.