35 లక్షలు దాటిన కరోనా కేసులు..63వేల మరణాలు

35 లక్షలు దాటిన కరోనా కేసులు..63వేల మరణాలు

దేశంలో రోజు రోజుకు కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గత నాలుగు రోజులుగా  ప్రతి రోజు 75 వేలకు పైగా కేసులు ,వెయ్యికి పైగా మరణాలు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 78,761 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,42,734 కు చేరింది. నిన్న మరో 948 మంది మరణించడంతో మృతుల సంఖ్య 63,498 కి  చేరింది. ఇప్పటి వరకు భారత్ లో  27,13,934 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 7,65,302 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

నిన్న ఒక్కరోజే 10,55,027 టెస్టులు చేశారు. వీటితో కలిపి ఆగస్టు 29 నాటికి మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 4,14,61,636 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.