సొంతూరుకు వెళ్లొచ్చే సరికి దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ సమీపంలోని వెలుగోములకు చెందిన విజయ భాస్కర్ రెడ్డి(42) బిజినెస్ మెన్. కొన్నేళ్లుగా వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్ లోని హరిహరపురం కాలనీలో నివసిస్తున్నారు. ఈ నెల7న కుటుంబసభ్యులతో కలిసి సొంతూరుకు వెళ్లారు. 8న రాత్రి తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపు ఓపెన్ చేసి ఉంది. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా సెంట్రల్ లాక్ సిస్టమ్ పగలగొట్టి ఉంది. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లోని 35 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి సామగ్రి పోయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా, పోలీసులు వచ్చి ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలాన్ని రాచకొండ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా చోరీకి గురైన ఇంట్లో సీసీ కెమెరాలు ఉండగా శనివారం రాత్రి 10:15 గంటలకు విజయభాస్కర్ రెడ్డి సోదరి తన సెల్ ఫోన్ లో సీసీ ఫుటేజీని చూశానని, తిరిగి ఆదివారం చూస్తే ఫుటేజ్ రాలేదని తెలిపింది.
వనస్థలిపురంలో 35 తులాల బంగారం చోరీ
- క్రైమ్
- March 10, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- RCB vs DC: వరుసగా ఐదో విజయం.. ఢిల్లీని చిత్తు చేసిన బెంగుళూరు
- మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
- పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
- ఎలాన్ మస్క్ ఆందోళన.. స్టార్ లింక్ శాటిలైట్స్ ప్రమాదంలో ఉన్నాయా?..అంతరిక్షంలో ఏం జరుగుతోంది?
- Orry Daily Income:సెలబ్రిటీలకే సెలబ్రిటీ..హీరోయిన్స్ను టచ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..ఎవరితను?
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ఫిర్యాదు చేసిన బీజేపీ అభ్యర్థి
- RCB vs DC: రాణించిన పటిదార్.. హోరాహోరీగా ఢిల్లీ- బెంగళూరు మ్యాచ్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- అభయాంజనేయ స్వామి ఆలయంలో గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు
- Alia 2024 Met Gala Ticket: 2024 మెట్ గాలా సీటు కోసం అలియా భట్ అంత చెల్లించిందా..వివరాలివే!
Most Read News
- హైదరాబాద్లో కొత్త స్విఫ్ట్
- నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- ప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్ ఒవైసీకి నవనీత్ రాణా కౌంటర్
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- కొచ్చి టస్కర్స్ మా పైసలియ్యలే.. : శ్రీశాంత్
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?