దేశంలో ఒక్కరోజే 38,310 కరోనా కేసులు

దేశంలో ఒక్కరోజే 38,310 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు  గత కొన్ని రోజులుగా తగ్గుతున్నాయి. ప్రతి రోజు 50 వేల కేసులు నమోదవుతుండగా..గడిచిన 24 గంటల్లో 38,310 కేసులు నమోదయ్యాయి. 490 మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు 82,67,623 కు చేరగా.. మృతుల సంఖ్య1,23,097 కు చేరాయి. నిన్న 58,323 కోలుకున్నారు. దీంతో దేశంలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య76,03,121 కు చేరింది. ఇంకా 5,41,405 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే దేశంలో 10,46,247 టెస్టులు చేశారు.